మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మున్నూరు కాపు సంఘం జిల్లా గౌరవ సలహాదారుడిగా పూదోట సూరిబాబు ను నియమిస్తూ తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు దుమ్ముగూడెం మండల మున్నూరు కాపు మండల కన్వీనర్ గా, నవతెలంగాణ విలేఖరి గా గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న సూరిబాబు సేవలను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం మున్నూరు కాపు జర్నలిస్ట్ యూనియన్ జిల్లా గౌరవ సలహాదారుడిగా నియమించింది అని అయన తెలిపారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో కొత్త లక్ష్మణ్ పటేల్ అప్పగించిన బాధ్యతలను వమ్ము చేయకుండా మున్నూరు కాపు కుల బాంధవులు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు గా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు
Post A Comment: