కరకగూడెం ఎస్ఐ ఇసనపల్లి.నాగబిక్షం :
మన్యం టీవీ, కరకగూడెం : భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గారి ఆదేశాల మేరకు నక్సలైట్ల వ్యవస్థను నిర్మూలిద్దాం-బంగారు భవితను నిర్మిద్దాం అనే నినాదంతో మండల వ్యాప్తంగా అనంతారం, పద్మపూరం,మోతే, తాటిగూడెం,కరకగూడెం బట్టుపల్లి గ్రామలలో కరకగూడెం ఎస్ఐ ఇసనపల్లి నాగబిక్షం అధ్వర్యంలో గోడ పత్రికలు వేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారు అని వారికి ఎవరైనా సహాయ సహకారాలు అందించినచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.అలాగే మావోయిస్టుల ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వగలరని, సమాచారం ఇచ్చినా వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని వారికి తగిన పారిదోషకం ఇవ్వబడునని అన్నారు.సమాచారం తెలిపిన వారికి బహుమతిగా 5 లక్షల నుండి 20 లక్షల వరకు బహుమతిగా ఇవ్వబడును అని అన్నారు.
Post A Comment: