CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వర్షపు నీటి వలన కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేపించాలి..

Share it:

 


మన్యం టీవీ చర్ల ::

భారీ వర్షాల కారణంగా జలమలమై పూర్తిగా పాడైపోయినటువంటి రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించి ఎంపిడిఓ కార్యాలయం ముట్టడించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కారం నరేష్ మాట్లాడుతూ తేగడ గ్రామపంచాయతీ పరిధిలోని జంగంపల్లి గ్రామంలో వర్షపు నీళ్ల వలన కంకర రోడ్డు కొట్టుకుపోయిందని ఇట్టి విషయం గ్రామ సర్పంచి పంచాయతీ సెక్రెటరీ తెలియపరిచిన త్వరలోనే రోడ్డు పనులు చేపడతామని హామీ ఇచ్చి పట్టించుకోవడంలేదని తెలిపారు గత నాలుగు సంవత్సరాలుగా వర్షాకాలం సీజన్లు రోడ్డు మొత్తం పాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ కు వినతిపత్రం అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు మరమ్మతులు సంబంధించిన విషయం పై అధికారి దృష్టికి తీసుకెళ్తానని సమస్య పరిష్కారం చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బందేల చంటి, ముత్యాలరావు, సమ్మక్క వరలక్ష్మి జంపయ్య సారయ్య రాంబాబు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: