CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోదావరి వరద ముంపు ప్రాంత ప్రజలకు ఇల్లు నిర్మాణం కొరకు స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్..

Share it:

మన్యం టీవీ - దుమ్ముగూడెం ::

మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల కారణంగా ముంపు గురవుతున్న ప్రజల ఇల్లు నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను మండల అధికారులతో జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  సున్నం బట్టి  వరద ప్రాంతాల్లో పరిశీలనకు వచ్చిన సందర్భంలో మంత్రి పువ్వాడ అజయ్,  కలెక్టర్ అనుదీప్ గ్రామస్తులు తమ ఊరిని వేరే ప్రాంతానికి తరలించాలని వేడుకున్నారు దీంతో మంత్రి ఆదేశాలతో సున్నం బట్టి గ్రామస్తులకు సురక్షిత ప్రదేశంలో ఇల్లు నిర్మాణం చేపట్టి ఇచ్చేందుకు  కలెక్టర్ అనుదీప్ రామచంద్రపురం గ్రామంలో గతంలో బృహత్తర పల్లె ప్రకృతి వనం నిర్మాణం కోసం అధికారులు గుర్తించిన ప్రభుత్వ స్థలాన్ని ఆయన పరిశీలించారు అనంతరం మండల లైబ్రరీ భవన నిర్మాణం కోసం దుమ్మగూడెం రోడ్డు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన ఆయన  2 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన క్రీడామైదానం కోసం  ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే ఉన్న మైదానంని ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. దుమ్ముగూడెం హెడ్ లాక్స్ వద్ద గోదావరి ఆనుకుని ఉన్న కరకట్ట పరిశీలించి అధికారులకు కరకట్ట ఎత్తును పెంచి పటిష్ట పరచాలని ఆదేశించారు ఈ సందర్భంగా గుర్తించిన ప్రభుత్వ స్థలాలను మార్కింగ్ చేయాలని మండల రెవెన్యూ అధికారులను ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, తాసిల్దార్ చంద్రశేఖర్, దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్, ఎంపీడీవో చంద్రమౌళి,  ఎం పి ఓ  ముత్యాలరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: