- క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి.
- ప్రతి ఆశా కార్యకర్త వారి గ్రామాల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలి.
- పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి శ్రీనివాసరావు.
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి శ్రీనివాసరావు సందర్శించారు. సందర్భంగా ఆయన ఆసుపత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలతో మాట్లాడుతూ, క్షయ వ్యాధి లక్షణాల గురించి ప్రతి ఒక్క ఆశ కార్యకర్త అవగాహన కలిగి ఉండాలని, నెలకు ఒక నమూనాను ప్రతి ఒక్క ఆశ కార్యకర్త చేయాలని తెలియజేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైపు ప్రజలు ఆలోచించే విధంగా సిబ్బంది పని చేయాలని, సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చూడాలని, వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు అవకాశం ఉందని, ప్రజానీకానికి ప్రతి ఆశ కార్యకర్త తప్పనిసరిగా పరిసరాల శుభ్రత గురించి వివరించాలని, ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా చూడాలని తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి సిబ్బంది హాజరవుతున్న తీరు, సమయపాలన గురించి ఆరా తీశారు. వ్యాధుల కారణంగా ప్రజానీకం ఆరోగ్య కేంద్రానికి వస్తారని, ఎప్పుడూ అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శివకుమార్, సిబ్బంది అరుణ్ బాబు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: