మన్యం టీవీ - దుమ్ముగూడెం ::
మండల పరిధిలోని పర్ణశాల గ్రామపంచాయతీ లో గోదావరి వరదల కారణంగా అంటూ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో సర్పంచ్ తెల్లం వరలక్ష్మి పర్యవేక్షణలో శానిటేషన్ పనులను నిర్వహించారు ఈ సందర్భంగా తను మాట్లాడుతూ ఏజెన్సీ అమాయక గిరిజన గ్రామాల ప్రజలకు అకాల వర్షాలు వరదల కారణంగా అనేక అంటూ వ్యాధులు సోకే అవకాశం ఉందని కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరిసరాలను శుభ్రపరుచుకోవాలని సాధ్యమైనంత వరకు నీటిని బాగా మరగ కాచి వడబోసి తాగాలని అనారోగ్యం గురైతే వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని వెళ్లాలని నిర్లక్ష్యం చేయరాదని తెలియజేశారు అలానే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో వైద్యుల కొరత ఉందని వర్షాకాలం సీజన్ కావడంతో రోగులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.
Post A Comment: