మన్యం మనుగడ - పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తహసిల్దార్ కార్యాలయ వీఆర్ఏలు తెలంగాణ ముఖ్యమంత్రి వీఆర్ఏల గురించి అసెంబ్లీ సమావేశంలో ప్రకటించిన విషయాలను అమలు చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా నిరవధిక సమ్మెను చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పినపాక పాత్రికేయుల సంక్షేమ సంఘానికి చెందిన పాత్రికేయులు వారి మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా పినపాక పాత్రికేయుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సనప భరత్ మాట్లాడుతూ, వీఆర్ఏలు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి గ్రామస్థాయి నుండి జరిగే విషయాలను తెలియపరుస్తున్నారని, అటువంటి వారిని చిన్నచూపు చూడడం తగదని, అసెంబ్లీ సమావేశంలో ప్రకటించిన విధంగా వారి డిమాండ్లను తీర్చాలని కోరాడు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు కొండయ్య, రోశయ్య, నరసింహారావు, జగదీష్, చందర్రావు, శ్రీను , రమణ, సర్వేశ్వరరావు, రమేష్, ఆర్ ఐ వీర్రాజు, పినపాక పాత్రికేయులు బిల్లా నాగేందర్, కీసర సుధాకర్ రెడ్డి, నరేష్, కట్టా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: