మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల వీఆర్ఏలు గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమం చేస్తున్న విషయం అందరికీ విధితమే. తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని తహసీల్దార్ కార్యాలయం ముందు, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి,తాము చేస్తున్న నిరసనకు ప్రభుత్వం స్పందించాలని వినతి పత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను, ప్రభుత్వం నెరవేర్చాలని వీఆర్ఏలు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు కొండయ్య, రోశయ్య, జగదీష్, నరసింహారావు, సౌందర్య, చంద్ర రావు, రమణ , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: