మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగ్నేపల్లి ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడుగా తన అమూల్యమైన సేవలందించిన హనుమ ఇటీవలనే ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు.ఉపాధ్యాయుడుగా ఉన్న కాలంలో పాఠశాలకు కావలసిన అదనపు సౌకర్యాల గురించి తనదైన శైలిలో పోరాటం చేసి, విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించారు.నూతన విషయాలను కనుగొనుటకు ఇన్నోవేటివ్ ఇన్స్పైర్ అనే కార్యక్రమంతో విద్యార్థులకు నూతన విషయాల పట్ల అవగాహన కలిగే విధంగా బోధన జరిపాడు.ఆయన చేసిన సేవలకు రెండు పర్యాయాలు ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందడం జరిగింది.అటువంటి ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లడం చాలా బాధగా ఉందని తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు పలికారు.ఆయన భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,తన విద్యా బోధన ద్వారా మరింత మంది విద్యార్థులకు సేవను అందించాలని ఉపాధ్యాయులు కోరారు.దిగినేపల్లి గ్రామానికి చెందిన ప్రజానీకం ఆయన బదిలీపట్ల తమ బాధను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రవి, ఉపాధ్యాయులు వీరన్న, పవన్, రాఘవులు, జోష్ణ, సునీత, సర్పంచ్ సత్యవతి , ఉప సర్పంచ్ నాగిరెడ్డి, గ్రామ పెద్దలు నంద, ఎస్ఎంసి చైర్పర్సన్ రామకృష్ణ, ఎంపీటీసీ ఉమాదేవి, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: