CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దుగినేపల్లి లో తల్లిపాల వారోత్సవాలు.ముర్రుపాల ప్రాముఖ్యతను వివరించిన అంగన్వాడీ కార్యకర్త

Share it:


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి పంచాయితీలో అంగన్వాడీ కార్యకర్త బిల్లం సంధ్యారాణి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జానంపేట సెక్టార్ సూపర్వైజర్ రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త బిల్లం సంధ్యారాణి ముర్రుపాల ప్రాముఖ్యత గురించి వివరించారు.బిడ్డకు జన్మనిచిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలి అని, ఈ యొక్క ముర్రుపాలుతోనే పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని తెలియజేశారు. సెక్టార్ పరిధి సూపర్వైజర్ రాణి మాట్లాడుతూ, తల్లిపాలు తాగిన పిల్లలు బలంగా, ఆరోగ్యంగా, తెలివితేటలతో పెరుగుతారు. కాబట్టి తప్పనిసరిగా పిల్లలకు ముర్రుపాలు పట్టించాలి అంటే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చేటటువంటి ఫోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే బిడ్డకు సరిపోయే అన్ని ఫోషకాలతో కూడిన పాలు తల్లి అందించగలదు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఝాన్సీరాణి, సరస్వతి, సోనీ, సుగుణ , ఆయాలు, ఆశ కార్యకర్తలు గర్భిణీ స్త్రీలు, బాలింతలు,పిల్లలు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: