మన్యం మనుగడ ప్రతినిధి,అశ్వాపురం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు నాలుగు కొట్ల ప్రజలతో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ అధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైస్ ఎంపిపి కంచుగట్ల వీరభద్రం మరియు పినపాక నియోజకవర్గం ఎస్సీ విభాగం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్ పూల దండలు వేసి ఘనంగా నమస్సుమాంజలి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి గడకారి రామకృష్ణ, టిఆర్ఎస్
పార్టీ యువజన విభాగం నాయకులు నజీర్ షోను, జూపెల్లి కిరణ్, మోదుగు వంశీ, రావుల అజయ్, మేకల భాస్కర్, మామిడాల శివ, మల్లే సంపత్, వెర్పుల నరేష్, మల్లె శంకర్, మందా రాంచరణ్, కొత్తపల్లి సతీష్, లంకెల అఖిల్, మేకల సతీష్, జూపెల్లి సునీల్, బాదావత్ రమేష్, శెట్టి సందీప్ సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: