- సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి..
- చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం..
మన్యం టీవీ చర్ల /దుమ్ముగూడెం ::
వర్షాకాలం సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ శిరీష తెలిపారు చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో భాగంగా 210 మంది విద్యార్థులను పరీక్షించి ఎనిమిది మంది జరపీడులను గుర్తించి రక్త పరీక్షలు నిర్వహించారు వారికి వారం రోజులు సరిపడే మందులు పంపిణీ చేశారు అలానే 40 మంది జలుబుకు, చర్మవ్యాధులకు మందులు అందించడం జరిగిందని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో డిపిఎంవో సత్యనారాయణ, హెచ్ ఇ ఓ వేణుగోపాలకృష్ణ, హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్, వెంకట నరసమ్మ, హెల్త్ అసిస్టెంట్ సమ్మక్క, స్వరూపరాణి, అనసూయ, ఆశ వర్కర్లు కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: