CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట మండలంలో పలువురు అధికారులను సన్మానించిన ఎమ్మెల్యే మెచ్చా

Share it:

 

మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం పలువురు అధికారులను అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు సన్మానించారు. అశ్వారావుపేట మండలంలోని ఎంపీడీఓ విద్యాధర రావు, తహసీల్దార్ చల్లా ప్రసాద్, సీడీపీఓ రోజారాణి, కానిస్టేబుల్ సంతోష్, ఫైర్ డిపార్ట్ మెంట్ కానిస్టేబుల్ నరేష్, సెరికల్చర్ డిపార్ట్మెంట్ రామయ్య, మైనార్టీ గురుకులం ప్రిన్సిపాల్ సంగీత, ఎన్ఆర్ఎస్ ఈసీ నరేష్ లకు జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారులుగా ప్రశంసపత్రాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆగస్ట్ 15వ తేదిన అశ్వారావుపేట మండలంలో 8 మందికి అందజేసిన సంధర్బంగా శుక్రవారం రోజు ఈ ఎనిమిది మందికి అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి నిర్వహించిన సన్మాన కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరై అధికారులను సన్మానించిన ఎమ్మెల్యే  మెచ్ఛా నాగేశ్వర రావు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజక వర్గంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రజల కోసం నిత్యం కష్టపడుతున్నారని ఆయన తెలిపారు. ఈ సంధర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలానికి వన్నె తెచ్చిన ప్రతి ఒక్క అధికారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వారికి ప్రశంసా పత్రాలు వస్తే అవీ మాకూ వచ్చినంత సంతోషంగా ఉందని, అశ్వారావుపేట మండలంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి నిరంతరం శ్రమిస్తూ ఏ సమస్య ఉన్న సరే మా దృష్టికి తీసుకు వచ్చి ప్రతి ఒక్కరితో సమన్వయంతో పని చేస్తూ జిల్లాలోనే అశ్వారావుపేట మండలానికి పేరు తెచ్చిన ప్రతి ఒక్కరికీ అలాగే వీరికి సహకరిస్తున్న ప్రతి ఒక్క అధికారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలియజేసారు. అనంతరం ఎమ్మెల్యే మెచ్చాని ఎంపీపీ సన్మానం చేసి మెమెంటో అందజేశారు. అలాగే అశ్వారావుపేట స్థానిక హైస్కూల్ లో 10 వ తరగతి చదివి 9.8 మార్కుల ఉత్తీర్ణత సాధించి ఐఐటిలో సీటు సాధించిన సందర్భంగా ఆ విద్యార్థి బి భవాని ని అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ రావుని సన్మానించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ ఒక ప్రభుత్వా పాఠశాల లో చదువు కొని 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి, అలాగే ఐఐటి సీట్ సాధించిన విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు. ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, మండల తెరాస పార్టి అద్యక్షులు బండి పుల్లారావు, సర్పంచ్ లు, సెక్రెటరీ లు, ఎంపిటిసి లు, మండల అధికారులు, తెరాస  పార్టి మండల నాయకులు మోహన్ రెడ్డి, బీర్రం వేంకటేశ్వర రావు, యుఎస్ ప్రకాష్, పట్టన తెరాస  పార్టి ప్రెసిడెంట్ సంపూర్ణ, టీడీపీ నేతలు కట్రం స్వామి దొర, నార్లపాటి శ్రీను, ఎంఎల్ పార్టీ ప్రభాకర్, వాసవీ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బారావు, మండల అర్యవైస్య ప్రెసిడెంట్ ఉమామహేశ్వర రావు, పట్టణ ఆర్యవైశ్య ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, జిల్లా ఆర్యవైశ్య మాజీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, గోల్డ్ షాప్ యూనియన్ ప్రెసిడెంట్ నరసింహారావు, వాసవీ క్లబ్ జోన్ చైర్మన్ బోగవల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: