- ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమమే పోలీసుల లక్ష్యం..
- గద్దెమడుగు గొత్తికోయ గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్..
మన్యం టీవీ దుమ్ముగూడెం ::
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గుత్తికోయ గ్రామాల ప్రజల అభివృద్ధి,సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అని భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నారు.ఈ రోజు దుమ్ముగూడెం మండలంలోని సి ఐ దోమల రమేష్, ఎస్సైలు రవికుమార్, కేశవ పోలీస్ సిబ్బందితో కలిసి గద్దెమడుగు గుత్తికోయ గ్రామాన్ని ఏఎస్పీ సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలకు పరిష్కారం దిశగా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి వెంటనే అట్టి సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచారు.అలానే తమ గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని ఏఎస్పీ కోరారు.అనంతరం అక్కడ ఉన్న పిల్లలకు బిస్కట్లు,బ్రెడ్ ప్యాకెట్స్,స్వీట్లను అందించారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మంది గ్రామస్తులు పాల్గోన్నారు.
Post A Comment: