CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముంపు ప్రజలకు ఆపన్న హస్తం.

Share it:

 



మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో మంగళవారం మొండికుంట కె.వి.ఆర్ కళ్యాణ మండపంలో గోదావరి వరద బాధిత కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే ఉపేందర్, ఉపాధ్యక్షులు డి రాంబాబు చేతుల మీదుగా 15 క్వింటాలు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

గోదావరి వరదలకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, అలాంటివారికి కష్టకాలంలో అండగా నిలవడం సాటి మనిషిగా ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. వరద బాధిత కుటుంబాలకు అండగా నిలవడానికి ముందుకు వచ్చి సహకారం అందించిన జిల్లా కమిటీ సభ్యులను, స్త్రీల కమిటీ సభ్యులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు మోహన్, జనరల్ సెక్రెటరీ నాగేశ్వరరావు, ట్రెజరర్ జోషి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: