మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై ఆదివాసి జెండాను ఆవిష్కరించి, అనంతరం కొమరం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల ప్రజలతో పాటు ఆదివాసి గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి ప్రజాప్రతినిధులు, ఆదివాసి ఉద్యోగ సంఘాల నాయకులు, మేధావులు, ఆదివాసి మహిళా ప్రజాప్రతినిధులు, ఆదివాసి సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: