మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని సీతారాంపురం గ్రామనికి చెందిన నాలి సత్యవతి ఏఎన్ఎం (33) సంవత్సరాలు సోమవారం నాడు పినపాక ప్రభుత్వ ఆసుపత్రి విధులకు హాజరయ్యేదెందుకు తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ తోగ్గూడెం గ్రామా వద్ద ప్రమాదవశాస్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మృతురాలి పార్థివ దేహానికి నివాళులర్పించారు.అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య టిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు గుడ్ల రంజిత్, ఉపాధ్యక్షుడు బుడగం రాము, చిరంజీవి, వెంకట్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి,రావుల రవి, పోగు వెంకటేశ్వర్లు, రేగా సత్యనారాయణ,వేణు, రామలింగం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: