మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలో స్థానిక సిహెచ్సిలో ప్రభుత్వ వైద్యశాలలో స్వాతంత్ర్య భారత ద్విసప్తాహం వేడుకలలో భాగంగా బుధవారం అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశానుసారం, అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు సూచనల మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఒక్క రక్త దాన కార్యక్రమానికి హాజరై రక్త దానం చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని రక్త దానం చేయడం జరిగిందని, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించినా ఈ ఒక్కా రక్త దానం కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికి పండ్లు, జూస్ పంపిణి చేయటం జరిగిందని ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ విద్యాధర రావు, చల్లా అరుణ, ఈఓఆర్డి సీతా రామరాజు, యుఎస్ ప్రకాష్, కలపాల శ్రీను, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కంచర్ల భాస్కర్ రావు, వికెడివిఎస్ కాలేజ్ ప్రిన్సిపాల్ శేషుబాబు, అశ్వారావుపేట టౌన్ తెరాస పార్టి కార్యదర్శి పసుపులేటి ఫణీంద్ర, హాస్పటల్ డాక్టర్స్ వేంకటేశ్వరరావు, అనుదిప్, హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: