CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మొండికుంటను మండలం కేంద్రంగా ప్రకటించాలి అని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన అఖిలపక్ష నాయకులు.

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంటను మండల కేంద్రంగా ప్రకటించాలి అని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఐక్యంగా ఈరోజు పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగ కాంతారావు కు వినతి పత్రాన్ని సమర్పించారు.పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మండలాలను ప్రకటిస్తున్న తరుణంలో మొండికుంటను మండలంగా ప్రకటించేలా చూడాలని విప్ రేగా కాంతారావును కోరిన అన్ని పార్టీల నాయకులు.అశ్వాపురం మండలం మొండికుంట లో పినపాక నియోజకవర్గం యం ఎల్ ఎ ప్రభుత్వ విప్ రేగా ‌ కాంతారావు ను కలిసి అన్ని పార్టీల నాయకులు మొండికుంట మండల కేంద్రంగా ప్రకటించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఉప సర్పంచ్ సుధీర్ మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ స్వర్గం బాలనర్సయ్య కమటం వేంకటేశ్వరరావు ముసుగు శ్రీనివాసరెడ్డి సురకంటి ప్రభాకర్ రెడ్డి కొండ బత్తుల ఉపేందర్ ముసుకు విరారెడ్డి పాములు బలవంతపు సుధీర్ తునికి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: