మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో గోదావరి వరద ముంపు కు గురై తీవ్రంగా నష్టపోయిన పాడి రైతులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధుల ద్వారా మంజూరు చేసిన పశువుల దాణా పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. పినపాక పశు వైద్యాధికారి డా.బాలకృష్ణ చవాన్ పర్యవేక్షణలో బయ్యారం, రావి గూడెం గ్రామాల పాడి రైతులకు పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ, పీ ఏ సీ ఎస్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, సర్పంచ్ కోరం రజిని చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నష్ట పోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీపీ గుమ్మడి గాంధీ తెలిపారు.
Post A Comment: