మన్యం మనుగడ , పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల వ్యాప్తంగా 75 వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా పోతు రెడ్డిపల్లి లోని ప్రాథమికోన్నత పాఠశాలలో మండలంలోని పాఠశాలల బాలికా విద్యార్థులకు సంబంధించి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ రావడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, స్నేహభావం పెంపొందుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోరం రజిని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, వివిధ పాఠశాలలకు చెందిన క్రీడోపాధ్యాయులు ఆదినారాయణ, అనిల్ కుమార్, వీరన్న, బాయమ్మ , అరుణ కుమారి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: