.
మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : పేదలకు అభాగ్యులకు సహాయం చేయడం మానవలక్షణమని సత్యసాయి సేవా సమితి మండల కన్వీనర్ మనోహర్ బాబు అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పేద విద్యార్థులకు 103 మందికి ఫ్యాడ్లు, పెన్నులు,నోటుపుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో మంచి చేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని, సత్యసాయిబాబా బాటలో మనమంతా ప్రయాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బాధ్యులు కుక్కడపు రామారావు, అనుప్, రామారావు, హెచ్ఎం ఆనంద్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: