మన్యం టీవీ చర్ల/
దుమ్ముగూడెం ::
ఇటీవల వచ్చిన గోదావరి వరద ముంపు వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు సహాయం ఇంతవరకు అందలేదని మండల పరిధిలోని వరద ముంపు బాధితులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కి సమస్యని వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ముంపు బాధితులకు అందరికీ సహాయం అందుతుందని, ఎవరు ఆందోళన చెందవద్దని లోటుపాట్లను సరిదిద్ది త్వరలోనే సహాయం అందుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునురావు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కోసరాజు రాజా, తేగడ సర్పంచ్ అలవాల పార్వతి, ఎంపీటీసీ శోభారాణి, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల వరప్రసాద్, తడికల రమేష్, సంతపురి సతీష్, చింతల రాము, తేగడ, గొంపల్లి, లింగాపురం వరద ముంపు గ్రామస్తులు కలెక్టర్ కలిసి వారి సమస్యను వివరించారు.
Post A Comment: