CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అశ్వరావుపేట కాంగ్రెస్ నాయుకులు

Share it:

మన్యం మనుగడ, అశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలో అశ్వరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవులు నిర్ణయం మేరకు అశ్వారావుపేట కాంగ్రెస్ నాయుకులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గం యువ నాయకురాలు వగ్గెల పూజ మాట్లాడుతూ ఆగస్టు 20, 1944లో ముంబైలో రాజీవ్‌ గాంధీ జ‌న్మించారని, 1984 అక్టోబ‌రులో ఆయ‌న దేశ ప్రధాని మంత్రిగా ప‌ద‌వీ బాధ్యత‌లు స్వీక‌రించడం జరిగిందని, అతి పిన్న వ‌య‌సులోనే ప్రధానిగా బాధ్యత‌లు స్వీక‌రించి రాజీవ్ గాంధీ సరికొత్త రికార్డు సృష్టించారని,1989 డిసెంబ‌ర్ 2 వ‌ర‌కూ ప్రధానిగా ప‌ని చేశారని తెలిపారు. కాగా మే 1991లో త‌మిళనా‌డులోని శ్రీపెరంబుదూర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో లిబ‌రేష‌న్ టైగ‌ర్స్ ఆఫ్ త‌మిళ ఈలం జ‌రిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.ఈ కార్యక్రమంలోఎంపీటీసీలు సత్యవరుపు తిరుమల, వగ్గెల అనసూయ, జిల్లా ఓబీసీ అధ్యక్షులు తుమ్మ రాంబాబు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పాండురంగ, అశ్వరావుపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జల్లిపల్లి దేవరాజు, బండారు మహేష్, సర్వేశ్వరరావు, అమర్నాథ్, హేమంత్ సాయి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: