మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో పలు గిరిజన గ్రామాలలో జోరు వానని సైతం లెక్క చెయ్యకుండా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్బంగా ఘనంగా జెండా ఆవిష్కరణల సంబరాలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా మండల ఆదివాసీ నాయకపోడు సేవాసంఘం సభ్యులు, గ్రామప్రజలు తమ గ్రామాలలో జెండా ఆవిష్కరణల నిర్వహించుకొని ర్యాలీగా బయలు దేరి మండల కేంద్రలో ఎస్ఆర్ బంక్ వద్దా నుండి జై ఆదివాసీ, జై నాయకపోడు నినాదాలతో ర్యాలీ నిర్వహించికొని జంక్షను వద్దా వున్నా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే ఏర్పాటు చేసినా ఆదివాసీ జెండాను ఆదివాసీ నాయకపోడు సేవాసంఘం రాష్ట్ర నాయకులు సంఘం ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. అదే విదంగా కొమరం బీమ్, మద్ది రాంచంద్రరావు చిత్రపటాలుకు పూల మాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆదివాసి నాయకపోడు సేవాసంఘం అశ్వారావుపేట మండల గౌరవ అధ్యక్షులు కోలా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఆదివాసి జీవితాల్లో మార్పు రాలేదని 1/70 చట్టం, మొదలగు గిరిజన చట్టాలు అమలకు నోచుకోలేదని ముఖ్యంగా ఆదివాసి తెగల్లో ఒకటైన తమ నాయకపోడు తెగ అన్ని రంగాలలో వెనుకబడి ఉందని ఇటు రాజకీయ పరంగా కూడా ఎటువంటి అవకాశాలు కల్పించక వెనుకంజలో తమ ప్రజలు వుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ఆదివాసి నాయకపోడు ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే విదంగా చదువు కోసం చదివించడం కోసం నాయకపోడు పిల్లలు వారు తల్లిదండ్రులు ఎంతో కృషి చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నారం వారి గూడెం సర్పంచ్ మనగొండ వెంకట ముత్యం, ఆదివాసి నాయక పోడు సేవా సంఘం ఉద్యోగ సంఘం జిల్లా సభ్యులు నారం శ్రీను, ఆదివాసి నాయక పోడు సేవా సంఘం మండల అధ్యక్షులు నారం సీతారాం సింగ్, ఉపాధ్యక్షులు గెడ్డం చిట్టిబాబు, కోశాధికారి గెడ్డం సత్తిబాబు, ప్రధానకార్యదర్శి దాది చంటి మరియు అనేక గ్రామాల ఆదివాసి గిరిజన నాయకులు, యువకులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: