మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో కోర్టు, ఆర్టీవో కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొగళ్ళపు చెన్నకేశవరావు, జడ్పీటీసి ములకలపల్లి & టిపిసిసి మెంబర్ సున్నం నాగమణి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోను ఉద్దేశించి మొగళ్ళపు చెన్నకేశవరావు, తుమ్మ రాంబాబు సున్నం నాగమణి మాట్లాడుతూ అశ్వారావుపేట, దమ్మపేట నుంచి కోర్టు, సబ్ రిజిస్ట్రార్, ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాలంటే సుమారు 100 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని, గతంలో కోర్టు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 35 కిలోమీటర్ల దూరంలో వున్నా సత్తుపల్లిలో ఉండవని, జిల్లా మార్పు వల్ల ఇప్పుడు జిల్లా కేంద్రానికి తరలించడం వల్ల అశ్వారావుపేట, దమ్మపేట సుమారు లక్ష మంది జనాభా కలిగిన రెండు మండలాలు ఈ రెండు మండలాలు ప్రజలు కొత్తగూడెం ఆఫీసులకు వెళ్లాలంటే సామాన్య ప్రజానీకానికి సరైన రవాణా సౌకర్యం లేదని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అశ్వారావుపేట లేక దమ్మపేటలో కోర్టు, సబ్ రిజిస్ట్రార్, ఆర్టీవో ఆఫీసులు ఏర్పాటు చేయాలని సున్నం నాగమణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మ రాంబాబు జిల్లా ఓబీసీ అధ్యక్షుడు, భూసి పాండురంగా జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు, కందుల వెంకటేశ్వరరావు జిల్లా ఎస్సీ సెల్ కమిటీ మెంబర్, మెుద్దు మరియమ్మ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఉప్పల రాజశేఖర్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు, ఎండి అంజుము ములకలపల్లి మండలం మైనార్టీ సెల్ అధ్యక్షుడు, నియోజక వర్గ యువ నాయకురాలు వగ్గెల పూజ, అనసూర్య ఎంపీటీసీ, చిన్నంశెట్టి రామకృష్ణ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జుజ్జూరి దుర్గారావు, వేముల ప్రతాప్, సర్వేశ్వరరావు, జల్లిపల్లి దేవరాజ్, జేమ్స్, ములగల కృష్ణ, వజ్రమ్మ, బాలగంగాధర్ సత్యవరపు అమర్నాథ్, బూరుగుపల్లి పద్మశ్రీ మరియు చలపతి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: