- మత్స్యకారుల బోట్స్ సహాయంతో ప్రజలకు చేసిన సేవలకు ఎస్పీ అభినందించారు..
మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని వరద ముంపు గురైన గ్రామాల ప్రజలకు పోలీస్ శాఖ సాయం చేయడంలో ముందుంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ జి వినీత్ తెలిపారు. లక్ష్మీనగరం అశ్రమ్ పాఠశాల ఏర్పాటుచేసిన సభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని 400 మంది వరద బాధిత కుటుంబాలకు పాల్వంచ నవభారతి కంపెనీ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల విలువగల నిత్యవసర సరుకులు భద్రాచలం ఏఎస్పి రోహిత్ రాజుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా మండలంలోని సున్నం బట్టి, ఎం కాశిగానారం గ్రామాలకు తీవ్ర నష్టం జరిగిందని, గోదావరి వరదల సమయంలో దుమ్ముగూడెం మండలం మొత్తం ఒక లంక మాదిరిగా తయారైందని, వరదల్లో అతి భయంకరంగా నష్టపోయిన సున్నం బట్టి గ్రామం ముఖ్యమంత్రి సైతం అవగాహన ఉందని అంతటి నష్టం వాటిలిందని అన్నారు. వరదల సమయంలో పోలీస్ సిబ్బంది మండల అధికారులు మెరుగైన సేవలు అందించారని కొనియాడారు. వరదల సమయంలో మండలంలోని మత్స్యకారుల బోట్ల సహాయంతో ప్రజలకు చేసిన సేవలకు వారిని ప్రత్యేకంగా అభినందించారు వారికి భద్రాది కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో అవార్డులు ప్రధనోత్సవం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. వరద బాధితులకు సరుకులు పంపిణీ చేసిన నవభారత్ కంపెనీకి డైరెక్టర్ కి ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఏఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ భారీ వరదలు సంబంధించిన ఎటువంటి ప్రాణ నష్టం జరుపుకుంటా పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో కృషి చేశారు అని ప్రశంసించారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల్ని అందరూ ఈ మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని మందులు ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా వాడుకోవాలని విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు దుమ్ముగూడెం ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించిన వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సుమారు 500 మంది బాతులకు మధ్యాహ్నం భోజనం పోలీస్ శాఖ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పి రోహిత్ రాజ్, నవభారత్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మూర్తి దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్, ఎస్సై రవికుమార్, కేశవరావు డాక్టర్ వసుంధర సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: