మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలం లోని వీఆర్ఏల సమస్యల పరిష్కారం చేయాలని గత ఎనిమిది రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు మద్దతుగా యువజన సంఘం పూర్తి మద్దతు సంఘీభావం తెలియజేశారు అనంతరం మండల అద్యక్షులు గుడ్ల సాయి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు సమస్యల పరిష్కారం చేస్తానని ఇంతవరకు ఆయన ఇచ్చిన హామీని నిర్వహించాలేక పోయారని వీఆర్ఏలకు పేస్కేల్ జీవోను విడుదల చేసి వెంటనే అమలు పరచాలని హారత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని 55 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి మరియు పెన్షన్లు సౌకర్యం కల్పించాలి అని అదేవిధంగా గా వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు వీఆర్ఏల సమస్యలపైన ఎప్పుడు ఏ ఆందోళన పోరాటం చేసిన మా యువజన సంఘం దుమ్ముగూడెం మండల కమిటీ ఎప్పటికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న వీఆర్ఏలు చిట్టిమల్ల చిరంజీవి, పి నవీన్, షాలిని, టి వెంకట లక్ష్మి, డివైఎఫ్ఐ నాయకులు వంశి, జంపన్న రెడ్డి కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: