CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు యూనిట్లను పంపిణీ చేసిన ఎంఎల్ఎ మెచ్చా..

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణంలో అశ్వారావుపేట మండలంలో దళిత బంధు లబ్ధిదారులకు అశ్వరావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దళిత బంధు ద్వారా లబ్ధిదారులు ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ స్టార్, టెంట్ హౌస్ మరియు బట్టల షాపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గిరిజన భవన్ లో 10ట్రాక్టర్లు, 2 కార్ లు,1 ప్యాసింజర్ ఆటో ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చాకు లబ్ధిదారులు ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, దళిత బంధు ద్వారా ఎంతో మందికి లాభం చేకూరుతుందని, దళిత బంధు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరవద్దని ఆయనకి మనం అందరం రుణపడి ఉండాలని కొంతమంది మాకు దళిత బంధు రాలేదని నిరశచెందుతున్నరని ఎవరు నిరాశ పడవద్దని 2వ విడత దళిత బంధు ఉందని త్వరలో వస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిదులు, ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: