దమ్మపేట:(ములకలపల్లి):మన్యం మనుగడ ప్రతినిధి :మండలం లోని నాగులపల్లి గ్రామానికి చెందిన భూక్య వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సాయంత్రం వేల రహదారి ప్రక్కనుండి నడుచుకుంటూ తన ఇంటికి వెళ్లు తుండగా,నాగేంద్ర రావు ద్విచక్ర వాహనం తో వెంకటేశ్వరరావునీ ఢీ కొట్టడం జరిగింది.వెంకటేశ్వరరావు కి తలకి బలంగా దెబ్బ తగలడం తో, సమీపన ఉన్న గ్రామస్తులు,కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సత్తుపల్లి ఆసుపత్రుకి తీసుకువెళ్లారు.ఊరి చివరన వీధి దీపాలు లేకపోవడంతో చీకటిగా ఉండటం వలన బైకు మీద వస్తున్నటువంటి వ్యక్తి బైక్ కి లైటింగ్ సరిగా లేకపోవడం తో ఎదురుగా నడుచుకుంటూ పోయే వ్యక్తి కనిపించక పోవడం వల్ల ఈ ఘటన జరిగింది అని స్థానికులు తెలియజేయడం జరిగింది.
Post A Comment: