- గణేష్ ఉత్సవాల బాధ్యత కమిటీదే
- భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు జరిపించాలి
- హెచ్చరించిన ఏడూల్ల బయ్యారం పోలీసు శాఖ
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యరం పోలీస్ గణేష్ ఉత్సవాలు జరిపే కమిటీలను హెచ్చరించింది. మండలంలో జరగబోయే గణేష్ ఉత్సవ కమిటీలకు వివిధ గ్రామలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆయా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవాలు నిర్వహించదలచినవారు ముందస్తుగా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఈ క్రింది విషయాలు వెల్లడించారు.
1. కమిటీ వారిదే పూర్తి బాధ్యత అనే విషయం గుర్తించాలి.
2. పంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. 3. విద్యుత్ కలెక్షన్ల నిమిత్తం విద్యుత్ సంస్థ నుండి అనుమతి తప్పనిసరిగా పొందాలి.
4. గ్రామాలలో వివిధ కూడల్లో వద్ద మండపాలను ఏర్పాటు చేసుకుంటున్నామని పోలీస్ శాఖకు తప్పనిసరిగా తెలియజేయాలి.
5. ఏవండో మైకులు ఏర్పాటుకు మీసేవ పోలీసు అనుమతి తప్పనిసరిగా ఉండాలి.
6. డిజె సౌండ్ అనుమతి లేదు అదే విధముగా గణేష్ మండపాల వద్ద రోడ్లు బ్లాక్ కావటం అంతరాయం ఏర్పడకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి.
7.ప్రశాంతమైన వాతావరణం లో అల్లర్లకు, చోటు ఇవ్వకుండా గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరుచున్నాముఅని ఏడూళ్ళ బయ్యారం ఎస్సై టివిఆర్ సూరి తెలియజేశారు.
Post A Comment: