గుండాల/ఆళ్లపల్లి ఆగస్టు16 (మన్యం మనుగడ)
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఆళ్లపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో 11.30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికారులు ప్రజాప్రతినిధులు మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ గీతాన్ని ఆలాపించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజు భార్గవి, జడ్పిటిసి కొమరం హనుమంతు , తహసిల్దార్ సాదియా సుల్తాన్, ఎంపీడీవో మంగమ్మ, ఎస్సై సంతోష్, వైస్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య, సర్పంచులు, మండల స్థాయి నాయకులు అధికారులు ప్రభుత్వ ప్రవేట్ పాఠశాల విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: