- ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను విద్యార్థులకు అందివ్వాలి.
- పిల్లలకు అందించే భోజన విషయంలో రాజీ పడేది లేదు.
- పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ.
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఆశ్రమ పాఠశాలను పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన విషయంలో విద్యార్థులకు పౌష్టిక ఆహారము అందించాలని, ఈ విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని, వార్డెన్ కు తెలియజేశారు. పిల్లల సంఖ్య పరంగా ఆహారం అందించాలని, ఇష్టం వచ్చిన విధంగా వంటకాలు తయారు చేయకూడదని, తప్పనిసరిగా మెనూ పాటించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సాయాన్ని కచ్చితంగా వారికి వర్తింపచేయాలని కోరారు. విద్యార్థుల చదువు విషయంలో, పౌష్టికాహార విషయంలో రాజీపడేది లేదని, మండలంలోని ప్రతి పాఠశాలను తనిఖీ చేస్తానని, ఎటువంటి తప్పులు దొర్లిన సహించేది లేదని అన్నారు. పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని గురించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.
Post A Comment: