CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ రెవిన్యూ సహాయకుల వినూత్న నిరసన

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట. తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు మంగపేట మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకులు ముఖ్యమంత్రి  ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే జీఓ ను విడుదల చేసేంతవరకు సమ్మె ను కొనసాగిస్తామని ఈ సందర్బంగా  తెలియజేశారు. ములుగు జిల్లా మంగపేట మండలం కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల నిరవధిక సమ్మె 9వ రోజుకి చేరింది, 9వ, రోజు నిరవధిక సమ్మెలో భాగంగా దీక్ష శిభిరాలను, పరిసరాలను శుభ్రం చేసి తమ నిరసన ను వినూత్న పద్దతిలో తెలియజేయడం జరిగింది.ఈ యొక్క నిరవధిక సమ్మెకు శ్రీయుత తహశీల్దార్ వై శ్రీనివాసులు , డిప్యూటీ తహశీల్దార్ జె సురేష్ బాబు, సీనియర్ అసిస్టెంట్ యేసుపాదం,  మరియు మాల మహా నాడు జిల్లా ఆధ్యక్షుడు కర్రి శ్యాంబాబు,మండల ఆధ్యక్షుడు మంచాల నాగేంద్ర బాబు,  హాజరై సంఘీభావం తెలిపినారు మంగళవారం జరిగినటువంటి  కార్యక్రమంలో  వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు చేస్తున్న న్యాయమైన కోరికలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇట్టి నిరవధిక సమ్మెలొ గ్రామ సేవకుల  మంగపేట మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు  నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మక్క, సమ్మయ్య , రాజేశ్వరి, పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ, తదితరులు  పాల్గొనడం జరిగినది.

Share it:

TELANGANA

Post A Comment: