CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జ్యేష్ట చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం, కావడిగుడ్ల గ్రామపంచాయతీలలో అశ్వారావుపేట మండల  కాంగ్రెస్ నాయకులు జ్యేష్టా సత్యనారాయణ చౌదరి, ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలతోపాటు జ్యేష్టా సత్యనారాయణ చౌదరి, ఆధ్వర్యంలో కన్నాయిగూడెం గ్రామపంచాయతీలో 27 కుటుంబాలు, కావడిగుడ్ల గ్రామపంచాయతీలో 26 కుటుంబాలు, కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా పేద కుటుంబాలకు బియ్యం దుప్పట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పాలనలో మన దేశం అభివృద్ధిలో అన్ని రంగాల్లోనూ ముందుకు నడిచేది పేదవాళ్లకు పక్కా ఇల్లు, విద్యుత్తు, ఐటి, రంగం గానీ అన్ని రంగాల్లో కూడా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని ఇప్పుడున్న అధికార పార్టీలు దేశంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రజలకు మాయమాటలు చెప్పి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అనేక విధాలుగా ప్రజలను మోసం చేస్తూ ఆయా కుటుంబాలు ఆ పార్టీ నాయకులు ఆర్థికంగా బలపడుతున్నారు. తప్ప ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు చేరటం లేదు అని బిజెపి టీఆర్ఎస్ పార్టీలను ఘాటుగా విమర్శించడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాజీవ్ గాంధీ, పాలన రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ, ప్రధాని అయితే అటువంటి పాలన వస్తుందని, ఆయా గ్రామాల్లో ప్రచారం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి నాగేంద్రరావు, ఆకిరిపల్లి రాంబాబు, తుమ్మిశెట్టి పోసియ, పానుగంటి రానా ప్రసాద్ గౌడ్, దాసరి రవి, కుంజా వెంకటేశు, సున్న మల్లేశ్వరరావు, భూక్య ప్రసాదు, చిర్రి వసంతరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: