గుండాల ఆగస్టు 20, మన్యం మనుగడ :
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దులలో శుక్రవారం జరిగిన పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులలో మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు మావోయిస్టు రెండు జిల్లాల సరిహద్దులోని ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అడవులను జల్లడపడుతున్నారు. అందులో గుండాల సీఐ కరుణాకర్ సిబ్బందితో కలసి గుండాల మండలంలో పోలీసులు ఎక్కడికక్కడ అణువణువు తనిఖీలను ముంగరం చేశారు. గుండాలకు వచ్చే వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీస్ వలయంలో ఏజెన్సీ అడవులు ఉన్నాయి. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అన్న భయాందోళనలో ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు
Post A Comment: