.
గుండాల ఆగస్టు 20, మన్యం మనుగడ :
మండల కేంద్రంలోని ప్రగతి విద్యాలయంలో కృష్ణ అష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలు కృష్ణుడు గోపిక వేషధారణలతో పాఠశాలకు హాజరై కృష్ణ అష్టమి వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం నృత్యాలు చేసి ఉట్టి కొట్టి సంబరాలలో మునిగితేలారు. అనంతరం ప్రిన్సిపాల్ తాటిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రత్యేక కృష్ణాష్టమి రోజున వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు విద్యార్థులు సైతం ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ప్రత్యేక జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు
Post A Comment: