మన్యం మనుగడ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం కేశప్పగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో, భారత స్వాతంత్ర ద్వీసప్తాహం వజ్రోత్సవ వేడుకలలో భాగంగా శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం నందు స్థానిక మహిళల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా సర్పంచ్ కొమరం బాబురావు, పాల్గొని ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొమరం బాబురావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్వహించే, ఈ భారత స్వాతంత్ర్య విసప్తాహం వజ్రోత్సవ వేడుకలు కనుల పండుగల వున్నాయని, తెలిపారు. ముగ్గుల పోటీలు పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి శ్యామల, రెండో బహుమతి రాధా, మూడో బహుమతి వెంకటలక్ష్మికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమరం బాబురావు, సెక్రెటరీ కార్తీక్, సీసీ సత్యనారాయణ, వివో ఏ పార్వతి, అంగన్వాడీ టీచర్ కాకా వెంకాయమ్మ, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: