మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన మాజీ పి ఏ సి ఎస్ డైరెక్టర్, సివిల్ కాంట్రాక్టర్ మైల రఘోత్తమ రెడ్డి శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ ఎంపీటీసీ సర్పంచ్, కుడుముల లక్ష్మీనారాయణ వారి మృతి కి చింతించి,రఘోత్తమ రెడ్డి పార్ధివా దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మల్లూరు దేవస్థానం చైర్మన్ నూతిలకంటి ముకుందం, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య పి ఏ సి ఎస్ డైరెక్టర్ నార్ర శ్రీధర్, మల్లూరు దేవస్థానం డైరెక్టర్ యర్రంశెట్టి రామకృష్ణ,మండల నాయకులు, చిట్టిమల్ల సమ్మయ్య,మండవ రామకృష్ణ, ముగల రమేష్, మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: