ఆగస్ట్ 3 ( మన్యం మనుగడ) : గుండాల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2006 అటవీ హక్కుల చట్టాన్ని పార్లమెంటులో సవరణ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుందని దానిని వ్యతిరేకిస్తున్నామని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోనీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అనైతిక విధానాలతో దేశం దుర్భరస్థితికి చేరనుందని అన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని సవరించి అడవి మీద ఆదివాసులకు హక్కులు లేకుండా చేయడం కోసం మోడీ కుట్ర పన్నుతున్నారని అన్నారు. కార్పోరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారన్నారు. తక్షణమే అటవీ హక్కుల చట్టాన్ని సవరించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిని సత్యం, రంగన్న, నరేష్ , లాలయ్య, లాజర్, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: