CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఖబర్దార్ కాంగ్రెస్ ద్రోహి రాజగోపాల్..!

Share it:

 


  • ఖబర్దార్ కాంగ్రెస్ ద్రోహి రాజగోపాల్..!
  • కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే పుట్టగతులండవు.
  • హెచ్చరించిన మాలోత్ రాందాస్ నాయక్..

జూలూరుపాడు ఆగస్టు 3, (మన్యం మనుగడ ప్రతినిధి) ఖబర్దార్ కాంగ్రెస్ ద్రోహి రాజగోపాల్. నోరు అదుపులో పెట్టుకో అని వైరా నియోజకవర్గ నాయకులు మాలోత్ రాందాస్ నాయక్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వైరా నియోజకవర్గనాయకులు రాందాస్ నాయక్ మాట్లాడుతూ, ఎంతో విశ్వాసంతో ఓటు వేసి గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ద్రోహం చేస్తున్నారని తెలిపారు. రాందాస్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి మారుతున్న రాజగోపాల్‌రెడ్డి అన్నం పెట్టిన అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలపై నోరు జారటం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే స్వార్థ రాజకీయాల కోసం ఆయన పార్టీ మారుతున్నాడని విమర్శించారు. డబ్బు అహంకారపు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని బ్రమ పడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే పుట్టగతులు ఉండవని రాందాస్ నాయక్ అన్నారు. కేంద్రంలో ఉండి నేనే రాజు నేనే మంత్రి అన్న చందాగా విర్రవీగి, ఈడీని వాడుకొని పబ్బం గడుపుకొంటున్న బీజేపీ పార్టీ రాజ్యాంగ సూత్రాలను పూర్తిగా కాలరాస్తున్నదని, అలాంటి పార్టీని నమ్ముకొని అన్నం పెట్టిన అమ్మను విమర్శించే రాజగోపాల్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

Share it:

TELANGANA

Post A Comment: