CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారత స్వతంత్ర వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వజ్రోత్సవ వన మహోత్సవం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై,స్థానిక టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి పలు రకాల మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.జాతీయ భావం పెంపొందించేలా రోజుకో కార్యక్రమం చేస్తున్నామన్నారు. హైదరాబాదులో సీఎం కేసీఆర్ వేడుకలను ప్రారంభించారని తెలిపారు.దేశంలోని అన్ని రాష్ట్రాలకు భిన్నంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో స్వతంత్ర సమరయోధులు త్యాగాలను భావితరాలకు తెలియజేసే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.మహాత్మా గాంధీ చరిత్రను భావితరాలకు అందించాలని ఆయన సూచించారు.రెండు వారాలపాటు నిర్వహించే వేడుకలలో అందరు భాగ్య సామ్యులై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయకుమారి,జడ్పిటిసి పొశం నర్సింహారావు,ఎంపీడీఓ వీరబాబు,ఎంపిఓ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు,సర్పంచ్ లు,స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ మండల,పట్టణ అధ్యక్షులు,ముత్యంబాబు, అప్పారావు,ముఖ్య నాయకులు,యువజన నాయకులు,మహిళ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: