CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అటవీశాఖ ఆధ్వర్యంలో 75వ భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు.. ప్రతి ఇంట్లో భారత జెండా ఆవిష్కరించిన అనంతరం ఒక మొక్కను నాటాలి..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో భద్రాచలం రేంజ్ పరిధిలోని ఆర్లగూడెం, తునికిచెరువు ఫారెస్ట్ లో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎఫ్ డి ఓ బాబు స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఎంతో సంతోషకరంగా ఉందని అలానే ప్రతి ఒక్కరూ ఇంట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఒక మొక్క నాటాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అటవీ శాఖ ప్లాంటేషన్ ద్వారా అటవీ శాతం పెరిగిందని దీని వలన వర్షాలు కూడా సమృద్ధిగా పడతాయని మొక్కలు నాటడం వల్ల సమస్త జీవ కోటికి ప్రాణదారం ఆక్సిజన్ మొక్కలు అందిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎఫ్ఆర్ఓ రజిత ఆర్లగూడెం డిఆర్ఓ కృష్ణ సర్పంచ్ ఇరప చంటి కొరస సునీత ఎంపీటీసీలు లలిత సీతమ్మ ఉప సర్పంచ్ కొమరం వెంకటేష్ అటవీ శాఖ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: