మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో అన్ని పంచాయతీ లలో అనర్హులను గుర్తించి రేషన్ కార్డులు రద్దు చేయడం జరుగుతుందని తహశీల్దార్ విక్రమ్ కుమార్ తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నప్పటికీ ని ఆహార భద్రత కార్డుల ద్వారా రేషన్ పొందుతున్నారని , అలాంటి వారిని గుర్తించి తొలగించడం జరుగుతుందన్నారు.పినపాక మండలంలో సుమారు 400 మంది అనర్హులు ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన జాబితాను రేషన్ డీలర్ల కు విచారణ నిమిత్తం పంపించడం జరిగిందని తెలియజేశారు.
Post A Comment: