మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామంలో బోనాలతో ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించారు. ఆదివారం శ్రావణమాసం ఆఖరి ఆదివారం కావడంతో గిరిజనులు బోనాలతో డప్పు వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలతో బయలుదేరి, గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో గల ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి కూడా బోనాలతో వారితో కలిసి మొక్కలు చెల్లించారు. ఇలా శ్రావణమాసంలో బోనాలతో మొక్కులు చెల్లించడం వల్ల పాడిపంటలు, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో సంతోషంగా ఉంటారని తెలిపారు.
Post A Comment: