మన్యం మనగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పలు కార్యక్రమాలలో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన జగ్గారం గ్రామానికి చెందిన మైపా వీరబాబు,జానంపేట గ్రామానికి చెందిన బుడుగుల శ్రీను, మల్లారం గ్రామానికి చెందిన జాడి కిరణ్ లు ఏర్పాటు చేసిన దుకాణాలను ప్రారంభించారు.పినపాక గ్రామానికి చెందిన సోంపల్లి తిరుపతికి దళిత బంధు పథకం ద్వారా లభించిన వాహనాన్ని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు ప్రారంభించారు. అనంతరం జానంపేట గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. తోగ్గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఉప్పాక గ్రామానికి చెందిన మార్తా నరసింహారావు కుమారుడి రిసెప్షన్ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమాలలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు , కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: