- అధికారుల నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బదీస్తుంది.
- తక్షణమే పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ల మరమ్మత్తులు నిర్వహించాలి.
- మురుగునీటి స్వస్తి పలికి ప్రజలకు మంచినీటిని అందించాలి.
- సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా చర్ల మండల కమిటీ
మన్యం టీవీ చర్ల:
చర్ల మండలంలోని సుందరయ్య కాలనీ గ్రామం లో పగిలిన భగీరథ పైప్ లైన్లు మరమ్మతులు చెయ్యాలని మురుగునీటి బదులు మంచినీటిని సరఫరా చేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎం ఎల్ ప్రజాపంధా చర్ల మండల (భాద్యులు) నాయకులు కొండా చరణ్ మాట్లాడుతూ మంచినీటిని అందించే పైపులైన్లు పగిలిపోయి చాలారోజులగా ప్రజలు మురుగునీరు ద్వారా కలుషితమైన ఈ నీటినే తాగుతున్నారు. తద్వారా అనేకమంది అనారోగ్య బారినపడ్డారు. పలుమార్లు ప్రజలు ఈ సమస్యను కొయ్యురు పంచాయతీ అధికారి కార్యదర్శి దృష్టికి, సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం భాద్యత రాహిత్యంమని అన్నారు. సమస్యని పరిస్కారం చేయకపోగా మీరిచేసుకోండి లేకుంటే లేదు అని మాట్లాడటం సరైంది కాదు అని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు స్పందించి తక్షణమే పగిలిన పైప్లైన్లని బాగుచేసి కలుషితనీరూ రాకుండా చర్యలు తీసుకొని మంచినీటి సౌకర్యం అందించాలని డిమాండ్ చేశారు. లేనియెడల గ్రామస్తులను ఏకం చేసి ఈ సమస్య పై ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా చర్ల మండల నాయకులు లంకా వెంకట్, పాలెం చుక్కయ్య,గ్రామస్థులు సత్యం, పెద్దరపు కృష్ణ, మర్రం రాజమ్మ, సుంకరి రాజు, మంగవేని తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: