మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం నరసాపురం సర్పంచ్ వర్ష శివరామకృష్ణ పై జరిగిన దాడి ఘటనలో సిపిఐ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రావులపల్లి రవికుమార్ స్పష్టం చేశారు.ఇరువురు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను పార్టీకు ఆపాదించడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిజానిజాలను లోతుగా అధ్యయనం చేసి మాట్లాడాలని అంతేకానీ ఏకపక్షంగా ఓ పార్టీపై బురద చల్లడం సరైన పద్ధతి కాదన్నారు.సర్పంచ్ శివరామకృష్ణ పై జరిగిన దాడిని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూనే ఉందన్నారు.స్నేహపూర్వక వాతావరణం లో నరసాపురం గ్రామపంచాయతీను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సర్పంచ్ శివరామకృష్ణ తో కలిసి ఉప సర్పంచ్ గా తాను అవిశ్రాంతంగా శ్రమిస్తున్నామన్నారు.ఏజెన్సీలో ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ఆది నుంచి ఉద్యమ బాటను చేపట్టి ఎందరో అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగుతున్న పార్టీ సిపిఐ అన్నారు .కొందరు వ్యక్తులు ఆదివాసి ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టించి సిపిఐ పై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.
Post A Comment: