- నర్సాపురం సర్పంచ్ శివరామకృష్ణ పై దాడికి పాల్పడిన దుండగులను చట్టపరంగ శిక్షించాలి...
- భద్రాచలం ఏఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న మండల సర్పంచుల సంఘం..
మన్యం టీవీ దుమ్ముగూడెం ::
గత శనివారం రాత్రి భద్రాచలం పెట్రోలు బంక్ వద్ద నరసాపురం సర్పంచ్ వర్శ.శివరామకృష్ణ పెట్రోలు కొరకు వెళ్తుండగా వెనకనుండి బండిని లాగి కింద పడవేసి దాడికి పాల్పడిన దుండగులు దారపుణేని రమేష్, బల్లా సాయికుమార్ లు కులం పేరుతో తిడుతూ కిందపడవేసి కొట్టి దాడికి పాల్పడిన సదరు దుండగుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని దుమ్ముగూడెం మండల కమిటి మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఏ ఎస్ పి భద్రాచలం రోహిత్ రాజ్ కలసి పిర్యాదు చేశారు ఈ విషయ ఫిర్యాదు పై స్పందించిన ఏఎస్పీ సర్పంచ్ శివరామకృష్ణ పై దాడికి పాల్పడినవారిపై కేసు నమోదు చేస్తామని ఇకముందు ఇట్లాంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్సులు అన్నే సత్యనారాయణమూర్తి,కణితి.రాముడు,మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఇర్ప చంటి, సర్పంచులు వర్శ శివరామకృష్ణ, మడకం చందు కటేబోయిన వెంకటేశ్వరవు, సోడే కొండయ్య, తెల్లం రామకృష్ణ, సోడే జ్యోతి, తెల్లం వరలక్ష్మి, మీడియం జయ, ఎంపీటీసీలు తెల్లం భీమరాజు తిరుపతిరావు బాలకృష్ణ టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు నాగేశ్వరరావు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: