మన్యం మనుగడ ఏటూరు నాగారం
వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె నేటికీ 13 రోజుకు చేరింది. ఈ సందర్భంగా వీఆర్ఏలు అర్ధ నగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందుగా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతికర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. వీఆర్ఏలకు నేతకాని మహార్ సంఘం మద్దతు తెలిపారు. నేతకాని మహార్ సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు కొండ గొర్ల పోచయ్య, మధుబాబు, సోదరి పోచయ్య అర్జున్ హరీష్ శ్రీను లక్ష్మీకాంత్ రమేష్ ప్రకాష్ వెంకటయ్య శేఖర్ రాజేష్ సమ్మయ్య శివ మద్దతు తెలిపిన నాయకులు ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు గంపల శంకర్, జబ్బ నాగేశ్వరరావు,కుమ్మరి వెంకటయ్య,గోగు విజయలక్ష్మి, కాళ్ళ రాము,గద్దల కృష్ణ పాల్గొన్నారు.
Post A Comment: